కలెక్టర్ను కలిసిన టీజీవో నేతలు
మహబూబ్నగర్ టౌన్ జూలై 14 : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్.విజయకుమార్ నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి డా. బాలు యాదవ్ బైకాని, ఉపాధ్యక్షురాలు డా. ఐ. విజయకుమారి, జాయింట్ సెక్రటరీ సమ్మయ్య ని జిల్లా కలెక్టర్కు పరిచయం చేశారు.
టీజీఓ అభ్యర్థన మేరకు టీజీవో సంఘానికి కేటాయించబడిన స్థలాన్ని పరిశీలించి, కార్యాలయ భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎం.యాదగిరి, ట్రెజరర్ కె.టైటస్ పాల్, ఉపాధ్యక్షులు ఎల్.సి.తానాజీ,జాయింట్ సెక్రటరీ నరేష్ కుమార్,ఆర్గనైజింగ్ సెక్రటరీఎన్.గంగాధర్, ఈసి మెంబర్ చంద్రకళ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






