మాజీ వైస్ ఎంపీపీ హఠాన్మరణం
05-06-2026 04:55 PM
మఠంపల్లి,(విజయ క్రాంతి): మండల పరిధిలోని రామచంద్ర పురం గ్రామానికి చెందిన భారాస పార్టీ మఠంపల్లి మాజీ వైస్ ఎంపీపీ రూపవత్ కవిత గురువారం అకాల మరణం చెందారు.రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ దవాఖానలో చేర్పించారు. అక్కడ గురువారం పరిస్థితి విషమించి మృతి చెందారు. కవిత మరణవార్త తెలుసుకున్న పిల్లుట్ల రఘు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రామచంద్రపురం గ్రామానికి చేరుకున్నారు.కవిత భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రఘు భావోద్వేగానికి లోనయ్యారు. విషాద వదనంతో,చెమ్మగిల్లిన కండ్లతోనే ఆమె భర్త రామచంద్రపురం మాజీ సర్పంచ్ రూపవత్ కృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.






