5 June, 2026 | 6:06 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి

05-06-2026 04:53 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): గో మాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ మఠంపల్లి మండల కేంద్రంలో సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హుజూర్ నగర్ - మట్టపల్లి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంపల్లి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకట శివ మాట్లాడుతూ... హిందువులు ఆరాధించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవధ పై,బలి కోసం ఆవులను తరలించి చేసే అమ్మకాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని పేర్కొన్నారు.హిందూ సమాజానికి ఆవులు పవిత్రమైనవని, ప్రీతిపాత్రమైన గోవులను రాజ్యాంగ పరంగా రక్షించాలని ఆయన చెప్పారు.సంతలో క్రయ విక్రయాలు జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.