13 April, 2026 | 9:20 PM

కోనరావుపేట మండలంలో ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పరీక్షలు

13-04-2026 07:58 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో నిర్వహించిన పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ కొనసాగింది. అధికారులు, పర్యవేక్షకుల సమన్వయంతో పరీక్షలు సజావుగా సాగాయని, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.