బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి
14-05-2026 01:14 AM
మహబూబాబాద్, మే 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి బుధవారం బాధ్యతను స్వీకరించారు. వెన్నం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, ఇందుకు శ్రీకాంత్ రెడ్డి నిదర్శనమన్నారు. జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేయాలని సూచించారు.






