పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం
12-05-2026 07:54 PM
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు రెమిడీయల్ ప్రత్యేక శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా పరిశీలకులు హరికృష్ణ, శ్రవణ్ కుమార్ శిక్షణ కేంద్రంను సందర్శించి మాట్లాడినారు.
కోదాడ నియోజకవర్గం 5 మండలాల కోదాడ, అనంతగిరి, చిలుకూరు, మునగాల, నడిగూడెం సంబంధించి పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు వ్రాయునన్న విద్యార్థులు రెమిడీలు శిక్షణా తరగతులకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈనెల 12 నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కాల నిర్ణయ పట్టిక ప్రకారం వివిధ సబ్జెక్టులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపినారు.






