25 June, 2026 | 2:45 AM

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

25-06-2026 01:37 AM

డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ శైలజ అన్నారు. బుధవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలో దోమల నివారణ చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు  03 వాహనాలపై అమర్చిన ఫాగింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కాలనీలు, నివాస ప్రాంతాలు మరియు ప్రజా ప్రదేశాలలో ఈ ఫాగింగ్ యంత్రాల ద్వారా విస్తృతంగా దోమల నివారణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్  శ్యామ్ సుందర్ రావు, ఎస్డబ్ల్యూఎం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  జాహ్నవి శశాంక్, ఎస్డబ్ల్యూఎం అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.