10 May, 2026 | 10:37 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

భద్రాచలంలో సెల్ఫీ సూసైడ్ కలకలం

15-12-2025 02:17 PM

హైదరాబాద్: భద్రాచలంలో(Bhadrachalam) మహాజన మహిళా సమైఖ్య జిల్లా అధ్యక్షురాలు మేకలలత సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా, చికిత్స నిమిత్తం భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక వివాదాన్ని పరిష్కరించే విషయంలో కొంతమంది దళిత సంఘం నాయకులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఒక మహిళకు జరిగిన అన్యాయం విషయంలో తాను జోక్యం చేసుకున్నందుకు, గుండే సుహాసిని, తోకల దుర్గా ప్రసాద్, ముద్ద పిచ్చయ్య, కనక శ్రీను, టి. రమణయ్య అనే కొందరు వ్యక్తులు తనను వేధిస్తున్నారని లత ఆరోపించారు. ఈ విషయం స్థానిక పోలీసులకు కూడా తెలుసని చెప్పారు. ఆమె మరణానికి బాధ్యులైన వారిని ఏ పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని మేకల లత విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన భద్రాచలంలో కలకలం రేపింది.