11 March, 2026 | 2:48 PM

Breaking News

మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •  

పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గించాలి

07-03-2026 12:06 AM

బొమ్మినేని రవీందర్ రెడ్డి వినతి

హనుమకొండ, మార్చి 6(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో పలు పారిశ్రామిక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు చింతలపల్లి వీరారావు పాల్గొని పరిశ్రమల సమస్యలను మండలి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్‌కు ప్రోత్సాహం కల్పించాలన్నరు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీని ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే పరిశ్రమలు తీవ్ర భారంలో ఉన్నాయని, అదనపు సర్ ఛార్జీలు విధించి వాటిని మరింత కుంగదీయవద్దని విజ్ఞప్తి చేశారు. కాటన్ పరిశ్రమలు సీజనల్ కావడంతో ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే నడుస్తాయని, మిగిలిన 9 నెలలు ఖాళీగా ఉన్నా విద్యుత్ భారం పడుతోందని,ఆఫ్ సీజన్ పీరియడ్ నిబంధనలను సవరించి పరిశ్రమలకు ఊరటనివ్వాలని కోరారు.

ఎండీ ఛార్జీలు తగ్గించాలన్నారు. కేవలం 4 నెలల పని కాలానికి 12 నెలల పాటు మాగ్జిమమ్ డిమాండ్ ఛార్జీలు చెల్లించడం భారంగా మారిందని, వీటిని తగ్గించాలని విన్నవించారు. 2012లో ఎంఎస్‌పీ సేకరణ కోసం మిల్లులు నడిపిన సమయంలో హెచ్‌టీ వినియోగదారులపై వేసిన పీనల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. రవీందర్ రెడ్డి గారి విన్నపాలపై ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. పీనల్ ఛార్జీల రద్దు అంశం అతి త్వరలోనే పరిష్కారం అవుతుందని, అధికారిక ఉత్తర్వులు రాగానే పంపిస్తామని హామీ ఇచ్చారు.