ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో
21-04-2026 02:50 PM
ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో దాడులు
25000 నగదుతో పట్టుబడ్డ ఆర్డీవో
నారాయణపేట,(విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో ఏసీబీ(Anti Corruption Bureau) దాడుల్లో పేట ఆర్డీవో రామచంద్రనాయక్ 25000 లంచం తీసుకొంటూ ఎసిబికి పట్టుబడిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి జనన ధృవీకరణ పత్రం కోసం ఆర్డీవో రామచంద్రనాయక్ సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేయటంతో ఆయన ఏసీబీని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఆధారాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నారాయణపేట ఆర్డీఓ పై నిఘా ఏర్పాటు చేసి పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ తెలిపారు.






