9 May, 2026 | 3:29 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

ప్రజాసేవే ప్రధాన లక్ష్యం

17-12-2025 12:04 AM

గుర్రాలగొంది ప్రజలకు రుణపడి ఉంటా 

సిద్దిపేట రూరల్, డిసెంబర్ 16: ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది గ్రామ సర్పంచ్ ఆకుల స్వప్న హరీష్ అన్నారు. గ్రామ సర్పంచ్ గా ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల నాయకులు మంగళవారం గ్రామంలోని ఆయన స్వగృహంలో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉద్యోగాల వైపు వెళ్లకుండా గ్రామస్తులకు సేవ చేయాలని లక్ష్యంతో రాజకీయ ప్రవేశం చేసినట్లు చెప్పారు.

ఎంపీటీసీగా గ్రామానికి అందించిన సేవలను గుర్తించిన ఓటర్లు సర్పంచ్ అవకాశం కల్పించారని అందుకు గ్రామస్తులకు రుణపడి ఉంటానని తెలిపారు. తన గెలుపుకు కృషిచేసిన సహచారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.