9 May, 2026 | 9:50 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

హైకోర్టు తీర్పు ప్రకారం హామీలను నెరవేర్చాలి

24-02-2026 12:00 AM

ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయపూడి వెంకట్ నారాయణ

కోదాడ, ఫిబ్రవరి 23: హైకోర్టు తీర్పు ప్రకారం హామీలను నెరవేర్చాలని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ సంక్షేమ సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకట్ నారాయణ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమకారులకు ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఉద్యమకారులు హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు అందుకు స్పందించి ఉద్యమకారులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది.

అభయ హస్తం స్కీము కింద అప్లై చేసుకున్న ఉద్యమకారులకు  250 చదరపు గజముల స్థలము, నెలకు 25 వేల రూపాయల పెన్షన్  8 వారాల్లోగా ఇవ్వాలని ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శికి, ఫ్రీడమ్ ఫైటర్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా దీనిపై అనుకూలంగా స్పందించడం వల్ల సమస్య పరిష్కారమైంది ఇందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.