12 May, 2026 | 10:56 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

23-12-2025 07:30 PM

నస్పూర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మేము ఎంతో, మాకంత వాటాకై ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల దాటవద్దని తీర్పును బూచిగా చూపిస్తుందన్నారు.

రాజ్యాంగంలో ఎక్కడ 50% రిజర్వేషన్లు దాటరాదని ఎక్కడ లేదనీ, సుప్రీంకోర్టు జడ్జీలు నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయం మాత్రమే అగ్రకులాలకు 10% రిజర్వేషన్లతో 50% సీలింగ్ దాటిందనీ, దానికి ఏ సీలింగ్ అడ్డురాదని, రాజ్యాంగ సవరణ ద్వారా 10% రిజర్వేషన్లు కల్పించిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసి విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజ్జల్లి వెంకటయ్య, శాఖపూడి భీమ్ సేన్, చంద్రగిరి చంద్రమౌళి, అంకం సతీష్, రామగిరి రాజన్న చారి, ధర్మాజీ మల్లేష్, చెలిమెల అంజయ్య, వేముల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.