3 April, 2026 | 12:13 AM

Districts - Mancherial

article_37514556.webp
దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): లక్షెట్టిపేటలో కలకలం సృష్టించిన నకిలీ నోట్ల చలామణి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వివరాలను వెల్లడించారు. నకిలీ నోట్ల చలామణి కేసులో గతంలో 12 మందిని అరెస్ట్ చేయగా, అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారన్నారు. పరారీలో ఉన్న కోదండరావు (కాకినాడ), రవి (పశ్చిమ గోదావరి జిల్లా), శ్రీనివాస్ (గోదావరిఖని) లను ఇటిక్యాల సమీపంలో సిఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారన్నారు.

02-04-2026

article_25194195.webp
మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

మంచిర్యాల, మార్చి 31 (విజయక్రాంతి): మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి, ఆర్‌టిసి మంచిర్యాల డిపో మేనేజర్, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధి అనితలతో కలిసి ఎ పి ఎం లు, డి పి ఎం లు, స్వయం సహాయక సంఘాల మహిళలతో మహాలక్ష్మి పథకం అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన మాట్లాడారు.

01-04-2026