14 May, 2026 | 9:59 AM

Districts - Mancherial

article_15138672.webp
పప్పు ధాన్యాల సాగుతో లాభాలు

మంచిర్యాల,(విజయక్రాంతి): వరి ఏక పంట సాగును తగ్గించి, పంటల వైవిధ్యీకరణలో భాగంగా పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయల సాగు చేపట్టి నేల సారాన్ని పెంచుతూ స్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రొఫెసర్ జయశంకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జే సాయి ప్రసాద్ సూచించారు. బుధ వారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం బుద్ధిపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (RMS) కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీ శివకుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు.

13-05-2026