మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన మంథని ప్రభుత్వ ఆసుపత్రి నూతన వైద్యులు
మంథని, జూలై 29(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దు ద్దిళ్ల శ్రీధర్ బాబు ను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి నూతనంగా నియమితులైన వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ద్వారా మంథని ప్రభుత్వ ఆసుపత్రికి రెగ్యులర్ ప్రాతిపదికన ఎంపికైన వైద్యులు బుధవారం మంత్రికి పూ లమొక్కలు అందించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.మంథని ప్రభుత్వ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ టీ.వి. రాజశేఖర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుకు పూలమొక్కను అందజేశారు. ఇటీవల నియమితులైన గైనకాలజిస్ట్ డాక్టర్ మామిడిపల్లి స్రవంతి, అనస్థీషియా స్పెషలిస్ట్ డాక్టర్ గుంట మౌనిక తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సూపరింటెండెంట్ మరియు స్పెషలిస్ట్ వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆసుపత్రి నిర్వహణ, ప్రజలకు అందించాల్సిన సేవలపై పలు సూచనలు చేశారు.మెరుగైన వైద్య సేవలు మంథని ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిందని, ప్రజలందరికీ నా ణ్యమైన వైద్యాన్ని అందించాలని స్పష్టం చేశారు.
రిఫరల్స్ తగ్గింపు
ప్రసూతి సేవల కోసం స్థానిక మహిళలు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని కోరారు. మంథని చుట్టుపక్కల గ్రామా ల నుండి వచ్చే గర్భవతుల కేసులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయకుండా ఇక్కడే నాణ్యమైన చికిత్స అందించాలని ఆదేశించారు.
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత
ప్రభుత్వ ఆసుపత్రిలో వీలైనంత వరకు సాధారణ (నార్మల్) ప్రసవాలు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
దంత వైద్య సేవల వినియోగం
ఆసుపత్రిలో ఇటీవల నియమితులైన డెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణిమ సేవలను ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సమస్యల పరిష్కారం
ఆసుపత్రి నిర్వహణలో ఏవైనా సమస్యలు లేదా అవసరాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు నిరంతరం సిద్ధంగా ఉంటామని వైద్యులకు హామీ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చారు.






