7 April, 2026 | 11:44 AM

Breaking News

సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన.. జూనియర్ లాయర్ హత్య   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •  

ఫలించిన ఎంపీ రఘురాం రెడ్డి కృషి

04-10-2025 12:58 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు

కొత్తగూడెం, అక్టోబర్ 3, ( విజయక్రాంతి ):ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామిరెడ్డి కృషి ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రీయ విద్యాలయం మంజూర అయింది.ఏజెన్సీ ప్రాంతమైన జిల్లాలో, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన పార్లమెంట్ లో చర్చించి, మంజూరు చేయాల్సిందిగా గతంలో కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. తాజాగా కేంద్రం స్పందించి జిల్లాకు కేంద్రీయ వి ద్యాల యాన్ని మంజూరు చేశారు.

కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగు కేటాయించగా అందులో ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు దక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలప్పుడు ఆదివాసీ బిడ్డల విద్యాభివృద్ధి కోసం, కేంద్రం చొరవ చూపాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చేసిన అ భ్యర్థనలు ఫలించాయి. ఎంపీ రఘురాంరెడ్డి చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నేతలు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.