కొడుకుని హత్య చేసిన తల్లి
21-06-2026 12:26 AM
ప్రియుడితో ఏకాంతంగా ఉండగా ఏడ్చాడని ఘాతుకం
మేడ్చల్, జూన్ 20(విజయ క్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్కు చెందిన స్వామి, జ్యోతి దంపతు లు కీసరలో ఉంటున్నారు. స్వామి క్యాబ్ డ్రైవర్. జ్యోతి ఇంటి వద్ద ఉంటోంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందే జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. గత నెల 29న జ్యోతి, నవీన్ ఏకాంతంగా ఉన్న సమయంలో కుమారుడు ఏడ్చాడు.
ఏడుపు వినిపిస్తే సమస్య ఎదురవుతుందని హత మార్చాలని నవీన్ చెప్పడంతో జ్యోతి నేలకే సి బాధగా బాబు మృతి చెందాడు. ఫిట్స్తో మరణించాడని చెప్పి సొంత ఊరిలో ఖన నం చేశారు. అనుమానం స్వామి నిలదీయ డంతో అంగీకరించింది. కీసర పోలీసులు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.






