7 July, 2026 | 3:39 PM

Breaking News

సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •  

గడప గడప ప్రచారం చేసిన ఎమ్మెల్యే బాలు నాయక్

05-02-2026 03:33 PM

దేవరకొండ,విజయక్రాంతి: దేవరకొండ మున్సిపాలిటీ లోని మూడవ వార్డ్ ప్రచారంలో గడప గడప ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ అనంతరం మాట్లాడుతూ... మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అంకూరి సుమలత రాజేష్  గెలుపు కోసం విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఎన్నికల నమూనా బ్యాలెట్ లో 02వ నెంబర్ పై మీ అమూల్యమైన ఓటు చేయి గుర్తుపై వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రతి ఇంటిని సందర్శించి స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, పట్టణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని వివరించి, రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకూరి సుమలత రాజేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,పట్టణ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, మహిళా నాయకురాలు, యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.