20-02-2026 12:03:15 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి సమయం దగ్గరపడుతుండటంతో, లక్ష్యానికి దూరంగా ఉన్న వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను రాబట్టేందుకు అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
ఏళ్ల తరబడి మొండి బకాయిలు పేరుకుపోయిన ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, వచ్చే నెల ఒక టో తేదీ నుంచి నోటీసులు జారీ చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం రంగం సిద్ధం చే సింది.మొండి బకాయిల వసూళ్ల కోసం ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వ న్ టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని ప్రజల్లోకి తీ సుకెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేవలం 10 శాతం వడ్డీతో అసలు పన్ను చె ల్లించే వెసులుబాటు ఉన్నప్పటికీ, చాలా మంది బకాయిదారులు ముందుకు రాకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.