10 May, 2026 | 8:36 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

డివిజన్ల పునర్విభజనపై విచారణ వాయిదా

15-12-2025 05:26 PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇటీవల డివిజన్ల సంఖ్యను పెంచడంపై విచారణ రేపటికి వాయిదా పడింది. డివిజన్ల పునర్విభజనను సవాలు చేస్తూ వినయ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసర విచారణ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి విచారణకు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ సమయంలో ప్రభుత్వం ప్రజల అభ్యంతరాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని, రాంనగర్ డివిజన్ పై తన అభ్యంతరాలను తీసుకోలేదని వినయ్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పర్యవసానంగా, కొత్త డివిజన్ల స్వరూపాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి ముందు, తాను సమర్పించిన అభ్యంతరాలను సమీక్షించి, వాటికి స్పందించాలని అధికారులను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. దీంతో డివిజన్ల పునర్విభజన వ్యవహరంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.