రన్ వేను ఢీకొట్టిన ఫ్లుటై
22-05-2026 12:00 AM
- ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు
- బెంగళూరు విమానాశ్రయంలో ఘటన
బెంగళూరు, మే ౨౧: ఢిల్లీ నుంచి గురువారం ఉదయం బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లుటై (ఏఐ-2651) బెంగళూరు కెంపెగౌడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా వెనుక భాగం రన్వేను బలంగా ఢీకొట్టింది. పైలట్లు అప్రమత్తమై జాగ్రత్తగా విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణకులు ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాదంపై ఎయిర్పోర్ట్ వరాలు స్పందిస్తూ ‘ ఎయిర్ ఇండియా వి మానం ల్యాండ్ అవుతున్న సమయంలో మరొక పెద్ద విమానం రన్వే నుంచి టేకాఫ్ అవుతున్నది. ఇదే సమయంలో వేక్ టర్బులెన్స్ సంభవించింది. దీంతో ఎయిర్ఇండియా విమానం కుదుపులకు లోనై రన్వే ను ఢీకొట్టింది. మరోవైపు ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేపడుతున్నది. ఈ ఘ టన కారణంగా సదరు విమానం తదుపరి సర్వీసులను రద్దు చేసింది.






