15 June, 2026 | 1:10 AM

రక్తదాతలకు సన్మానం

15-06-2026 12:01 AM

కోదాడ, జూన్ 14 ప్రపంచ రక్త దాతలు దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం కోదాడ పట్టణంలోని స్థానిక అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద సూర్యాపేట జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో రక్తదానంపై విశేష కృషి చేస్తున్న రక్తదాతలను గుర్తించి వారిని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నివేళలా ముందుండి రక్త దానం చేయిస్తూ ఎందరినో ప్రాణాల నుంచి కాపాడుతున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ

వారందరి సేవలకు గుర్తించి వారిని కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్ యేషయ్య చేతుల మీదుగా వారిని సత్కరించడం జరిగిందని సూర్యాపేట జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రమేష్ తెలిపారు. రక్తదానంలో విశేష సేవలు ఇచ్చిన వారిని సత్కరించిన వారిలో ఎంబిఎం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాతంగి సురేష్, స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చారుగుండ్ల రాజశేఖర్, ఏ వన్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు షేక్ నజీర్, కుడుముల రాంబాబు, గుండెపంగు.రవి, షేక్ హుస్సేన్, చిత్తలూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.