23-02-2026 07:38:41 PM
పాపన్నపేట: యూరియా కొరతను నిరసిస్తూ రైతులు సోమవారం మెదక్ - బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ యాప్లో నిమిషాల వ్యవధిలోనే స్టాక్ ఖాళీ అవుతోందని, తమకు ఎరువులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోవడంతో తహసీల్దార్ సతీష్ కుమార్, ఏవో శ్రీనివాస రాజు అక్కడికి చేరుకున్నారు. త్వరలోనే యూరియా ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.