12 May, 2026 | 11:17 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

13 జీపీల వార్డ్ మెంబర్లకు పంచాయతీ రాజ్ చట్టంపై శిక్షణ

23-02-2026 07:36 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ రైతువేదికలో 13 గ్రామ పంచాయతీల వార్డ్ మెంబర్లకు మొదటి విడతగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లకు నూతన పంచాయత్ రాజ్ చట్టం 2018లోని ముఖ్యమైన అంశాలను అందులో పొందుపరిచిబడిన అంశాలను వివరించడం జరిగింది. చట్టంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కార్యదర్శులు తీసుకోవాల్సిన విధులు బాధ్యతతో పాటు కొత్త పాత పంచాయతీరాజ్ చట్టాలకు ఉన్న తేడా గ్రామపంచాయతీ గ్రామసభ నిర్వహణ ప్రణాళికలు ఏ విధంగా తయారు చేసుకోవాలి.

విధులను ఏ విధంగా వినియోగించుకోవాలి. గ్రామ పంచాయతీలకు 2030 సంవత్సరం వరకు ప్రతి గ్రామ పంచాయతీని ఎలా ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుకోవాలో అనే అంశాలను నలుగురు పిఓటిలతో తేదీ 23 నుండి 27 వరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రకాష్, మాస్టర్ ట్రైనర్, కార్యదర్శులు పాల్గొన్నారు.