12 May, 2026 | 8:58 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నేమ్ బోర్డు వితరణ

23-02-2026 07:42 PM

నాగారెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి సోమవారం రూ.10 వేలతో కాలేజ్ నేమ్ బోర్డ్, స్వతంత్ర సమరయోధుల ఫోటోలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించి ఉత్తీర్ణులు కావాలని కోరారు.

ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరంలలో అత్యధిక మార్కులు సాధించి టాపర్గా నిలిచిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున బహుమతులను అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  నరేందర్ మండల బిజెపి నాయకురాలు కొండ మీరాతాయిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.