సమస్యలు పరిష్కరించాలని వినతి
08-07-2026 08:44 PM
కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని ఎస్సి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ జనత పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కోటపల్లి తహసిల్దార్ రాఘవేందర్ రావ్ కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు జిల్లాల విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాల అధ్వాన్నంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకొని విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్, పెద్దింటి పున్నం చంద్, మంత్రి రామయ్య, మండల ఎస్టి మోర్చా మహేష్, కోటపల్లి బూత్ అధ్యక్షులు కాశెట్టి రాకేష్, మండల సీనియర్ నాయకులు పూజారి సమయ్య, తదితరులు పాల్గొన్నారు.






