3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం

03-07-2026 08:24 PM

కల్లూరు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేసిన తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకులు స్వర్గీయ సాధిక్ అలీ 63వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి ఉషా శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల కోసం 15 డ్యూయల్ డెస్క్‌లను విరాళంగా అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. రత్న మాధురి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి. పద్మ మాట్లాడుతూ, సాధిక్ అలీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ నీరజ ప్రభాకర్ ఆయన ఆశయాలను ఉషా కొనసాగించడం అభినందనీయమని అన్నారు.

పురపాలక సంఘ చైర్మన్ డి. మోహన్ సాధిక్ అలీతో తన స్నేహాన్ని గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు. ఆర్యవైశ్య జిల్లా మహాసభ అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు కరోనా కాలంలో పేద విద్యార్థులకు ఆయన అందించిన సహాయాన్ని ప్రశంసించారు. ఉషా మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో సాధిక్ అలీ కృషి చేశారని, అదే మార్గంలో తాను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి నివాళులు అర్పించారు. ఉషా దాతృత్వాన్ని పురపాలక సంఘ పెద్దలు, శాంతినగర్ పెద్దలు సన్మానించారు. పాఠశాలకు వుడెన్ ర్యాక్ అందించిన కంటిపూడి మేరమ్మను కూడా సత్కరించారు.