ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
03-07-2026 08:52 PM
స్వామివారి నిత్య రాబడి 19,72,933
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట దేవస్థానంలో శ్రీ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. మహిళలు మంగళహారతిలో అమ్మవారిని స్వాగతం పలికారు. స్వామివారి నిత్య కైంకర్యాలను పండితులు నిర్వహించారు. అనుబంధ ఆలయం శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో శివుడికి అభిషేకం పండితులు నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడి 19,72,933/- వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు.






