పిచ్చిమొక్కల తొలగింపు
03-07-2026 08:49 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో శుక్రవారం ప్రోక్లైన్తో పిచ్చి మొక్కలు తొలగించారు. 11వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కాలనీలోని రాజీవ్ నగర్ లో వర్షాకాలం సందర్భంగా పొదలు పెరిగిపోయి ఉండగా వాటిని తొలగించారు. కాలనీలో ఎలాంటి సమస్య అయినా తమ దృష్టికి తీసుకురావాలని కౌన్సిలర్ కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కంఠం రవి, లక్ష్మీపతి గౌడ్, కాలనీవాసులు తదితరులు ఉన్నారు.






