కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి
03-07-2026 08:44 PM
బేల,(విజయక్రాంతి): బేల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)ను మండల ప్రత్యేక అధికారి మనోహర్, ఎంపీడీవో మహేష్, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడి వారి చదువు, వసతి, సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల వంటగది, స్టోర్ రూమ్ తో పాటు పాఠశాల ఆవరణను పరిశీలించి పరిశుభ్రత, ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలపై తనిఖీ నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని పాఠశాల సిబ్బందికి అధికారులు సూచించారు. ఈ తనిఖీలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.






