3 July, 2026 | 9:17 PM

Breaking News

వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •  

తాగారు.. దొరికారు..

03-07-2026 08:46 PM

- 'డ్రంక్ అండ్ డ్రైవ్'లో 45 మంది పట్టివేత 

- రూ.4.72 లక్షల జరిమానా 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణ, పరిసర ప్రాంతాల్లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన  తనిఖీల్లో 45 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్యంరాజు తెలిపారు. శుక్రవారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు చెప్పారు. విచారణ అనంతరం 45 మందికి కలిపి రూ.4 లక్షల 72 వేలు జరిమానా న్యాయమూర్తి విధించారని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ 38 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారందరికీ కలిపి రూ. లక్షా 76 వేల 5 వందలు జరిమానా విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్ ముత్యంరాజు స్పష్టం చేశారు.