20 March, 2026 | 9:46 AM

ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ

20-03-2026 12:00 AM

జీహెచ్‌ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు

ముషీరాబాద్, మార్చి 19(విజయక్రాంతి): ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జీహెచ్‌ఎంసి మాజీ ఫ్లోర్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిడ్డి రాంబాబు అన్నారు. ముస్లింల పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం అంబర్ పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్ లోని పకీర్ గూడలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు పవిత్ర రంజాన్ ను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.