ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నులి పురుగు మందు పంపిణీ
13-07-2026 03:57 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు సోమవారం నులి పురుగు మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిసి ఉపాధ్యక్షులు, 11వ వార్డు కౌన్సిలర్ రాజుర సత్యం మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగాలంటే నులిపురుగుల మాత్రలు చాలా మేలు చేస్తాయని, దాంతో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండవచ్చని, పాఠశాల పరిసరాలు పరిశుభ్రత చక్కగా నిర్వహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, వైద్య సిబ్బంది ,పలువురు పాల్గొన్నారు.






