3 May, 2026 | 1:21 AM

రైతులు ఏడుస్తుంటే సంబురాలా?

03-05-2026 12:00 AM
  1. అన్నదాతల ఉసురు పోసుకోవడమే ప్రజా పాలన లక్ష్యమా!
  2. దుబ్బాకలో ప్రజా పాలన సంబురాలను బహిష్కరించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
  3. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా మైకు కనెక్షన్ కట్ చేసిన అధికారులు 
  4. మైకులు విరగ్గొట్టి, రైతులతో కలిసి నిరసన తెలిపిన ఎమ్మెల్యే

సిద్దిపేట, మే 2 (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్డుపై పోసి రైతులు ఏడుస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన సంబురాలు జరుపుకోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. శనివారం దుబ్బాకలో జరిగిన నియోజకవర్గస్థాయి ప్రజా పాలన సంబురాల సభలో పాల్గొని, మాట్లాడుతుండగా అధికారులు మైకు కనెక్షన్ కట్ చేశారు.

దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మైకులను నేలకేసి కొట్టి సమావేశం నుంచి రైతులతో కలిసి బయటకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం ఇబ్బందుల గురి చేయడం బాధాకరమన్నారు. రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమి ఒరగపెట్టారంటూ విమర్శించారు. సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను ఎడారిగా మార్చారని ఎద్దేవా చేశారు.

కాలేశ్వరం కూలిపోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, మరి దు బ్బాక నియోజకవర్గంలోని కూడవెల్లికి ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయో ఈ ప్రాం త కాంగ్రెస్ నాయకులు అవగాహన చేసుకు ని సీఎంకు వివరించాలని చెప్పారు. తెలంగాణలో కులవృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయ ని, కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖ లు నిర్వీర్యమయ్యాయని, గ్రామీణ అభివృ ద్ధి, సాగునీటి పారుదల పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.

బీఆర్‌ఎస్ హయాం లో రైతు సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా అందించామని, రైతు వేదికలు, గోదాములు, భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించామని వివరించారు. గ్రామాలలో మంచినీటి సమస్యలు తీవ్రతరం అయ్యాయని అధికారులు పనిచేయడం లేదని, జిల్లా కలెక్టర్ పరిపాలన సాగించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజల బుద్ధి చెపుతారన్నారు.