ఎస్సీ యాక్షన్ ప్లాన్లో దరఖాస్తులకు ఆహ్వానం
కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ మార్చి 15 (విజయక్రాంతి) : ఎస్సీ యాక్షన్ ప్లాన్ 202526లో భాగంగా బ్యాంక్ అనుసంధానంతో ఎస్సీ వర్గాలకు వివిధ ఉపకరణాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోళ్లకు సబ్సిడీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాల కోసం 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు, ఇతర వ్యవసాయ ఆధారిత పథకాల కోసం 21 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలకు మించకూడదని, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదని పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం,
ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాస్బుక్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. దివ్యాంగులైతే సదరం సర్టిఫికేట్ కూడా జతపరచాలని సూచించారు.ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 17 నుండి 24 వరకు tsobmms.cgg.gov.in వ్బుసైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ వర్గాల వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.




