3 April, 2026 | 5:33 AM

Districts - Nagarkurnool

article_63184278.webp
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

నాగర్ కర్నూల్ రూరల్, ఏప్రిల్ 2: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రూ.10 వేల కోట్ల మేర ఆదా చేసుకున్న సందర్భంగా గురువారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం చెల్లించడం ద్వారా ఆర్టీసీకి ఆర్థికంగా బలమిచ్చినట్లు పేర్కొన్నారు.

03-04-2026

article_70643974.webp
ప్రజా పాలన వార్డు సభలో ప్రజల ఆగ్రహం

అచ్చంపేట ఏప్రిల్ 02: 'ఇందిరమ్మ ఇల్లు పేరుతో 5 లక్షలు ఇచ్చానని చెబుతున్నారు ఎవరికిచ్చారు ఎప్పుడు ఇచ్చారు. దాని నిరూపించాలి. చాలా మందికి తొలగించారు. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ పథకాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న చెబుతున్నారు. అవి ఎక్కడ అమలు చేశారు చూపించాలని' 15వ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అచ్చంపేటలోని 20 వార్డులలోనీ వివిధ ప్రాంతాలలో ప్రజాపాలన ప్రగతివేదిక వార్డు సభలను ఆయా వార్డు కౌన్సిలర్ అధ్యక్షతన నిర్వహించారు. అందులో భాగంగా అచ్చంపేటలోని 15వ వార్డు పరిధిలోని మైనార్టీ బిల్డింగ్లో నిర్వహించిన సభలో ప్రజలు పాల్గొన్నారు.

02-04-2026