18 May, 2026 | 11:29 AM

Districts - Nagarkurnool

article_82590089.webp
యువత ఆరోగ్యమే సమాజ బలం

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఫిట్ అండ్ యాక్టివ్ 2కె రన్, యోగా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పాల్గొన్నారు. యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే సమాజం బలంగా నిలుస్తుందని అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి బస్ స్టాండ్ ముందు వరకు నిర్వహించిన 2కే రన్‌లో యువత, అధికారులు పాల్గొన్నారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల శాఖ ఇంచార్జి అధికారి సీతారాం నాయక్, ఇంచార్జి వైద్యాధికారి రవి నాయక్, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర తదితరులు పాల్గొన్నారు.

18-05-2026

article_21848091.webp
తూకాల్లో లోపాలు లేకుండా కొనుగోలు జరగాలి

అచ్చంపేట: వరి మొక్కజొన్న కొనుగోళ్లలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ జరగాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని చందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నాణ్యత, తూకాల విధానం, రికార్డుల నిర్వహణ, నిల్వ సదుపాయాలు, హమాలి, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. హమాలి కొరత, రవాణా ఆలస్యం వంటి సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

16-05-2026

article_13950136.webp
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం: మంత్రి జూపల్లి

కొల్లాపూర్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. శనివారం కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఆసుపత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంతో ఇకపై విద్యుత్ అంతరాయం లేకుండా డయాలసిస్ సేవలు కొనసాగుతాయని తెలిపారు.

16-05-2026

article_25006342.webp
యాప్ నవీకరణ తర్వాతే యూరియా అమ్మకాలు

బిజినేపల్లి: ఖరీఫ్ పంటల సాగు చేసే నాటికి యూరియా అమ్మకాలు ప్రారంభం అవుతాయని, ప్రస్తుత యూరియా యాప్ నవీకరణలో ఉందని, మే చివరి కల్ల యాప్ రైతులకు అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయాధికారి కమల్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మన గ్రోమోర్ కేంద్రంలో ఎరువు నిల్వలను తనిఖీ చేశారు. ప్రతి వ్యవసాయ దుఖాణంలో తనిఖీలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ లైసెన్సులు పునఃరుద్ధరించుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మకాలు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. నకిలీ విత్తనాలు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

14-05-2026

article_26450033.webp
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ఊర్కొండ: మండల పరిధిలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Janampalli Anirudh Reddy), జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ తాగునీటి సదుపాయాలు, అంతర్గత రహదారులు, పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

14-05-2026