2 July, 2026 | 2:32 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

Districts - Nagarkurnool

article_45589214.webp
పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!

పరిస్థితి విషమం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలింపు. నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. గ్రామంలోకి దూసుకొచ్చిన కుక్క చిన్నారులు, మహిళలు, వృద్ధులు సహా సుమారు 10 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. గాయపడిన వారిని స్థానికులు వెంటనే తెలకపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ప్రథమ చికిత్సతో పాటు రేబీస్ వ్యాక్సిన్ అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం 108సాయంతో నాగర్‌ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో బొడ్డుపల్లి వెంకటేష్, సల్వది వర్షిణి, కాశమ్మ ఇటిక్యాల నిశ్వoత్, గౌరరం సైదులు, నేరేడి నవ్యశ్రీ, అల్వల యశ్వంత్, శేఖర్ తో పాటు మరికొంత మంది ఉన్నారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు.

02-07-2026

article_83171055.webp
అధికారులు ఇంటి నుంచి గెంటేశారు..!

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తాము నివాసం ఉంటున్న ఇంటిని కాళీ చేయించి తమను ఇరిగేషన్ శాఖ అధికారులు బయటికి గెంటేసారని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఓ వృద్ధ దివ్యాంగురాలు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమరాబాద్ మండలం దోమల పెంట (బ్రహ్మగిరి) గ్రామానికి చెందిన కె. సంతోషఅమ్మ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయం 2007లో బలహీన వర్గానికి చెందిన దివ్యాంగురాలిగా గుర్తించి అప్పటి కలెక్టర్ నివాసం ఉండేందుకు పాడుబడిన ఇంటిని కేటాయించారు. అందులో రిపేరు చేసుకుని తాను తన భర్త ఇద్దరు ఆడబిడ్డలతో నివసిస్తూ జీవనం గడుపుతున్న క్రమంలో ప్రస్తుతం ఏ-7- 13 బ్లాక్ ఇంటిని ఇరిగేషన్ శాఖ అధికారులు జప్తు చేస్తూ నోటీసులు ఇచ్చారని అందుకు గల ఆధారాలను పొందుపరిచినా వినకుండా తమను ఇంటి నుంచి బయటకు గెంటేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చాము నివాసము ఉండేందుకు ప్రభుత్వం సొంత ఇంటిని ఏర్పాటు చేయాలని కోరారు

30-06-2026