11 May, 2026 | 7:21 PM

మజ్జిగ పంపిణీ చేసిన అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు

11-05-2026 06:14 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మండుతున్న ఎండలకు కొంత మేరకు ఉపశమనం పొందేందుకు గాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద సోమవారం వీక్లీ మార్కెట్ కు వచ్చిన ప్రజలకు అల్లంకి భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యం లో చల్లటి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. మార్కెట్ కు వచ్చిన చిరు వ్యాపారులు, ప్రజలు మజ్జిగ  ప్యాకెట్లు తీసుకొని కొంత ఉపశమనం పొందారు, బగ్గు మంటున్న ఎండలకు ఈ మజ్జిగ పంపిణీ చేయడం పట్ల చల్లదాత సుఖీభవ అంటూ  పలువురు భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.