9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

మూడవ దశ ఎన్నికలకు సర్వం సిద్ధం

17-12-2025 12:07 AM

163 గ్రామాలు, 1432 వార్డులకు ఎన్నికలు 

సిద్దిపేట, డిసెంబర్ 16 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో 3వ దశ ముగింపుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలోనీ కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, చేర్యాల, కొండపాక, దూల్మిట్ట, మద్దూరు, కుకునూరుపల్లి, కొమురవెల్లి మండలాల్లో మొత్తం 163 గ్రామాలు, 1432 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

జిల్లా కలెక్టర్ హైమావతి గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగనున్నా గ్రామాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. రెండు దశలలో జరిగిన ఎన్నికలలో కోడ్ ఉల్లంఘించిన సంఘటనలో 33 కేసులు నమోదు చేశారు. అభ్యర్థులు, నాయకులు నిభందనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.