ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను హత్య చేసిన భార్య
హైదరాబాద్: బీమా సొమ్ము కోసం భర్త హత్య చేసిన ఒక మహిళ, ఆమె ముగ్గురు సహచరులను ఖమ్మం పోలీసులు(Khammam Police) అరెస్టు చేశారు. ఖమ్మం-కురవి ప్రధాన రహదారిపై ఎంవి పాలెం సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నప్పుడు హత్య వెలుగులోకి వచ్చింది. ఆ మృతదేహాన్ని ఖమ్మంలోని గాంధీనగర్ నివాసి, ఆటో రిక్షా డ్రైవర్ చాగంటి రవి (42) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రవికి ప్రశాంతితో 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు.
అయితే, రవి మద్యానికి బానిసైన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. రవి తాగిన స్థితిలో ఇంటికి తిరిగి వచ్చి ఆమెను తరచుగా హింసించేవాడు. రవి అనారోగ్యానికి గురికావడంతో, ప్రశాంతి రవి పేరుతో బీమా సౌకర్యాన్ని పొందింది. రవి చనిపోతాడని గ్రహించి, అతనిని అంతమొందించడానికి ఆమె తన భర్త బంధువు డి. శ్రీనివాస్ సహాయం తీసుకుంది. వారి పథకం ప్రకారం, వారు మార్చి 2న రవిని బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత వారు అతన్ని ఎంవీ పాలెం శివార్లలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. రవి రోడ్డుపై నిలబడి ఉన్నప్పుడు, ప్రశాంతి సహచరుడు రాజ్కుమార్ అతన్ని కారుతో వేగంగా ఢీకొట్టి చంపాడు. మొత్తం మీద, ఈ కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. రవి బంధువులకు ప్రశాంతిపై అనుమానం రావడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ స్టైల్ లో విచారించడంతో అసలు ముచ్చట బయటపడింది.




