10 March, 2026 | 2:54 AM

ఢిల్లీ మద్యం కేసు: ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై హైకోర్టు స్టే

09-03-2026 12:40 PM

ఢిల్లీ మద్యం కేసుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసుపై(Delhi liquor case) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Solicitor General Tushar Mehta) వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థపై తీర్పులో ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వారం రోజులు వాయిదా వేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. కేజ్రీవాల్, కవిత సహా 23 మంది నిందితులపై సీబీఐ కేసును ప్రత్యేక కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.