అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం
26-05-2026 03:45 PM
బోథ్, మే 26(విజయక్రాంతి): అర్హులైన వారందరికీ ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలన్నీ అందే విధంగా చూస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారుల కు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. అత్యవసర వైద్యం లో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే తాము మంజూరు చేయించి ఇస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్నారు.






