26 May, 2026 | 5:09 PM

Breaking News

భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •   ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •  

కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి

26-05-2026 04:10 PM

25 వేల ఆర్థిక సాయం

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని లింగాలపల్లి గ్రామానికి చెందిన సోయం లాలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఖమ్మం పట్టణంలోని యలమద్ది ప్రైవేట్ హాస్పిటల్‌లో కోమాలో చికిత్స పొందుతుండగా, మంగళవారం బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పరామర్శించి 25 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. యలమద్ది హాస్పిటల్‌లోని ఐసియులో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సోయం లాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. లాలు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం నింపారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో చాప చల్మారావు తదితరులు పాల్గొన్నారు.