26 May, 2026 | 5:28 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ

26-05-2026 04:40 PM

ఇల్లందు, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు కార్మికులకు లాభం కంటే నష్టమే కలిగిస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.సీతారామయ్య అన్నారు. మంగళవారం ఇల్లందులో జరిగిన ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న వేతనాల కంటే ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు తక్కువగా ఉండటంతో అన్‌స్కిల్డ్ నుంచి హైస్కిల్డ్ కార్మికుల వరకు వేల రూపాయల నష్టం జరుగుతోందన్నారు. కనీస వేతనాలపై పునఃసమీక్ష చేపట్టి కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించాలని, నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కొక్కు సారంగపాణి, తోడేటి నాగేశ్వరరావు, డి.ప్రసాద్, ఎన్.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.