మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి
హాజరుకానున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్
మంథని మే 26 (విజయక్రాంతి): రేపు మంథనిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడమైనదని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరుకానున్నారని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, మండల, కమిటీ ఏర్పాటు పై సమీక్ష సమావేశం నిర్వహించబడునని, ఈ సమావేశానికి శ్రీను బాబు హాజరైతరని, మంథని నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ లు పార్టీ ముఖ్య నాయకులు, ఆశవాకులు తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని అ ప్రకటనలో తిరుపతి యాదవ్ కోరారు.






