వైభవంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి
27-04-2026 12:41 AM
నవాబ్ పేట్ ఏప్రిల్ 26: మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే వేద పండితులు అమ్మవారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రేమ్ సుధాకర్, బచ్చు బాలరాజ్, కలివ నరసింహులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ఆర్యవైశ్య విభాగాల సమన్వయంతో వేడుకలు దిగ్విజయంగా చేయడం తోపాటు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.






