ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
13-07-2026 04:14 PM
నాగిరెడ్డిపేట్,జులై 13 (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద,రామక్కపల్లి గ్రామాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ ఊర చివర ఉన్నటువంటి కుంటల వద్ద 500 ఈత మొక్కలు నాటడం జరిగింది.అలాగే గ్రామస్తులకు ఇంటికో మొక్కను అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పుప్పాల సాయిలు,బెస్త సాయిలు, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సిఐ.ఎండి. షాకీర్ హైమద్ ఎక్సైజ్ సిబ్బంది సురేష్,వెంకటేష్, నాగరాజు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






