20 May, 2026 | 4:08 PM

Breaking News

ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీ టెండర్ గడువు మరోసారి పొడిగింపు   •   మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్   •   లింగాపురంలో తొలి దశ జనగణన ప్రారంభం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •  

తాగునీటి బోరింగ్ వద్ద అపరిశుభ్రత

17-11-2025 10:23 AM

చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు

చింతల మనెపల్లి,(విజయక్రాంతి): చింతల మనెపల్లి మండలం దిందా గ్రామంలోని త్రాగునీటి బోరింగ్ చుట్టూ మురుగు నీరు చేరి దుర్వాసన వాసిస్తోంది. బోరింగ్ ప్రాంతం పూర్తిగా అపరిశుభ్రంగా మారడంతో ప్రతిరోజూ త్రాగునీటి కోసం వచ్చే  పిల్లలు, గ్రామస్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.అత్యవసర త్రాగునీటి గా ఉపయోగించే బోరింగ్ చుట్టూ మురికి పేరుకుపోయినా పంచాయతీ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు బోరింగ్ వద్ద మురుగు నీటిని తొలగించి, పరిసరాలను శుభ్రపరచాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.