4 May, 2026 | 3:14 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

ఎన్డీఏతో పొత్తుకు అవకాశం లేదు.. విజయ్ క్లారిటీ

14-03-2026 01:59 PM


చెన్నై: తమిళనాడులో ఏఐఏడీఎంకే(AIADMK) నేతృత్వంలోని ఎన్డీఏ(NDA) కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశమేదీ లేదని, ఎన్నికల ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలు కేవలం మీడియా ఊహాగానాలు మాత్రమేనని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే(TVK) శనివారం స్పష్టం చేసింది. అయితే, తమిళగ వెట్రి కజగంతో పొత్తు చర్చలు జరుగుతున్నాయా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగెంద్రన్(BJP state president Nainar Nagendran) నేరుగా సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. "మీరు కూటమి గురించి ఆందోళన చెందుతున్నారు. కానీ నేను ప్రజల సమస్యల గురించి ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యం, మహిళలకు భద్రత కరువవడం గురించి ఆందోళన చెందుతున్నాను," అని నాగేంద్రన్ విలేకరులతో అన్నారు.