బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం.. 24 మంది జలసమాధి.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు!
బంగ్లాదేశ్లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు
24 మంది మృతి, గల్లంతైన వారి కోసం గాలింపు
ఢాకా: బంగ్లాదేశ్లో(Bangladesh) ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రవాణా ఫెర్రీని(Ferry) ఎక్కే ప్రయత్నంలో ఒక ప్రయాణీకుల బస్సు పద్మా నదిలోకి(Padma River) దూసుకెళ్లడంతో 24 మంది మరణించారని, మరికొందరు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. బుధవారం సాయంత్రం సుమారు 5:15 గంటలకు నైరుతి జిల్లాలోని రాజ్బారిలో గల దౌలాడియా టెర్మినల్ వద్ద ఒక బస్సు పద్మా నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
ఢాకా వెళ్తున్న ఆ బస్సులో పలువురు పిల్లలతో సహా సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో అత్యధికులు ఈద్ సెలవుల అనంతరం రాజధానికి తిరిగి వస్తున్నవారేనని అంచనా వేస్తున్నారు. అదుపు తప్పి బోల్తా పడిన(Bus Overturns) బస్సు నదిలో దాదాపు తొమ్మిది మీటర్ల లోతుకు మునిగిపోయిందని అధికారులు తెలిపారు. సహాయక బృందాలు ఇప్పటివరకు 22 మృతదేహాలను వెలికితీశాయి. వీరిలో 6 మంది పురుషులు, 11 మంది మహిళలు,5 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.




