1 June, 2026 | 3:46 PM

Breaking News

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •   NEET-UG రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు   •   అధిక వేగంతో కారు బోల్తా   •   ఆత్మకూర్ గ్రామ నూతన మరకత ఆత్మలింగేశ్వర ఆలయ నూతన కమిటీ ఏర్పాటు   •   ప్రాణం తీసిన IPL ఫైనల్... బావిలోకి దూసుకెళ్లిన కారు   •  

అన్నింటిపై సోషల్ మీడియా ప్రభావం

01-06-2026 02:47 PM

హైదరాబాద్: అన్నింటి పై సోషల్ మీడియా అతిపెద్ద ప్రభావం చూపిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్, AICC మీడియా ప్యానలిస్ట్ సరళ్ పటేల్, మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామమోహన్ రెడ్డితో కలిసి గాంధీభవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.... సంకుచిత మనస్తత్వం వీడి.. విశాల దృక్పథంతో పనిచేయాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) పిలుపునిచ్చారని మహేశ్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మంచి సబ్జెక్టు ఉండి బాగా మాట్లాడేవారిని ప్రోత్సహించాలని రాహుల్ గాంధీ చెప్పారని ఆయన వివరించారు. రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004, లేదా 2009లో ప్రధానమంత్రి అయ్యుండేవారని వెల్లడించారు. తనకు పదవులకంటే దేశం ముఖ్యమని రాహుల్ గాంధీ భావించారని వివరించారు.